Saturday, November 29, 2008

ముంబై మారణ హోమం...!

నాడు తల్లి పాలు తాగి రొమ్ము పిసికిన ఉన్మాది...
నేడు మతం పేరున మారణ హోమం చేస్తున్న ఉగ్రవాది...
దుర్మార్గంతో బతకమని ఏ మతం చెప్పింది... ?
దుష్కర్మలే జిహాదని ఏ హితం నేర్పింది... ?
పరమత సహనం లేని మానసిక మూఢులు..
జనహతమే మతమనుకొని చేయున్నయ్యా దాడులు...
మతం ముసుగులో ముష్కురుల ఇష్టా రాజ్యం...
రాక్షస కృత్యాలతో ఏర్పడుతుందా ఇస్లాం రాజ్యం... ?
ఓ... అల్లా...!
ఈ... మంద భాగ్యులకు నవ్య క్రాంతి పొసగు...!!
మా... ప్రపంచానికి శాంతి - సుఖాల నొసగు...!!!

No comments: