Sunday, November 30, 2008

అశ్రు నివాళి...!!!

కన్నతల్లికి అన్నం పెట్టని కొడుకులు...
కట్టుకున్న దాన్ని నట్టేటముంచే ద్రోహులు...
మతం మత్తులో ఉన్మత్తులు...
విద్రోహుల చేతిలో తొత్తులు..
పొరుగువాడి ఉన్నతిని కాంచలేని గుణం...
మతం పేరున జరుపుతుంది మారణహోమం ...
మతోన్మాదానికిదే నిలువెత్తు దర్పణం...
ముంబై నగరిపై లష్కరే ముష్కురుల దారుణం...
నా...
భరతమాత ముద్దుబిడ్డల దీక్షా కంకణం...
దుష్టశక్తులపాలిట అయ్యింది మృత్యువాహనం...
దేశం కొసం ప్రాణాల్నర్పించిన వీరులు ...
జాతి గుండెల్లో కలకాలం నిలిచిపోయే అమరులు...
అశృనయనాలతో,బాధాతప్త హృదయంతో...
వారికివే నా అక్షర నివాళి..
జై జవాన్... ! జై జై జవాన్..!!

No comments: